Saturday, April 27, 2024

నిరుపేదలను ఆదుకోవడమే మా లక్ష్యం..

హత్నూర : నిరుపేదలను ఆదుకునేందుకు  అసోసియేషన్ ఎల్లప్పుడు ముందుంటుందని,  పేదలకు ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి వస్తే వారిని ఆదుకుంటామని గమ్యం అసోసియేషన్ చైర్మన్ బక్కన్న గారి సురేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన హత్నూరలో నిరుపేద కుటుంబమైన చాకలి కిష్టయ్య.. వికలాంగులకు కరోనా  కష్టకాలంలో వారికి సరిపడే విధంగా సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.  అసలే కరోనా కాలంలో బయటకు వెళ్లలేని పరిస్థితి అందుకు  అలాంటి  సమయంలో నిరుపేదలను  ట్రస్ట్​ ఆదుకుంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో గమ్యం ట్రస్ట్​ సభ్యులు సాయి,  ప్రసాద్ గౌడ్ , మధుసూదన్ రెడ్డి,   నాగరాజ్​,  సుధాకర్ రెడ్డి,  డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement