Sunday, April 28, 2024

పూరిగుడిసె దగ్దం..

చిన్నశంకరంపేట : ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్దమైన సంఘటన మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు లక్షల ఆస్తినష్టం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగిని యాదగిరి భార్య పిల్లలతో పూరిగుడిసెలో నివాసముంటున్నారు. యాదగిరి బయటకు వచ్చి పనులు చేస్తుండగా గుడిసె పైకప్పు నుండి మంటలురావడంతో గుర్తించిన యాదగిరి అరవడంతో కుటుంబ సభ్యులు గుడిసె నుండి వెలుపలకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. ఈ సంఘటనలో కూతురు పెళ్లి కోసం తెచ్చిన సామాగ్రితో పాటు 20 వేల రూపాయల నగదు వంట సామాగ్రి బియ్యం కాలిపోయాయని బాధితుడు యాదగిరి తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement