Friday, March 29, 2024

20 మందికి వాక్సిన్..


చేగుంట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ వేశారు. చేగుంట సర్పంచ్‌ మంచికట్ల శ్రీనివాస్‌, మండల వ్యవసాయ అధికారి జయశంకర్‌, సహాయ అధికాకరులు మాధవి, శోభతో పాటు పలువురు కోవ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గురువారం 99 మందికి టీకా వేసినట్లు, అలాగే శుక్రవారం 98 మందికి, శనివారం 20 మందికి టీకా వేసినట్లు వైద్యులు తెలిపారు. చేగుంట మండలంలో వారం రోజులుగా ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటీవ్‌గా నిర్దారించారు. అందులో ఫార్మసిస్ట్‌ పడగయ్య కూడా ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో చేగుంట ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ వినయ్‌కుమార్‌ కొన్ని రోజులుగా విధులు హాజరు కాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement