Thursday, May 9, 2024

బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

జిన్నారం : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిన్నారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు బండి శ్రీకాంత్‌గౌడ్‌ ఆద్వర్యంలో పార్టీ కార్యాలయం ముందు బిజెపి జెండాను ఎగరవేశారు. అనంతరం అధ్యక్షుడు బండి శ్రీకాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో ఆయన ఆశయాలకు అనుగుణంగానే నేడు భారత ప్రధాని నేరంద్రమోడీ ముందుకు తీసుకెళ్లుతున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం ధర్మ కోసం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వికాస్‌చారి, భానుకిరణ్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌, మహేష్‌ శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement