Saturday, April 27, 2024

కేశోరాం అధ్యక్షునిగా మనోహర్ రెడ్డి..12 ఓట్లతో విజయం

కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ ఉద్యోగుల ఎన్నికల్లో అధ్యక్షునిగా బయప మనోహర్ రెడ్డి విజయం సాధించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల్లో 263 ఓట్లకు గాను 263 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆటో గుర్తుపై పోటీ చేసిన భయ్యపు మనోహర్ రెడ్డికి 97 ఓట్లు రాగా, హ్యాండిల్ హ్యాండ్ గుర్తుపై పోటీ చేసిన సూర సమ్మయ్య కు 85 ఓట్లు, ధర్మచక్రం గుర్తుపై పోటీ చేసిన నవీన్ కు 78 ఓట్లు రాగా మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి. మనోహర్ రెడ్డి 12 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement