Saturday, April 27, 2024

ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకుందాం..

పెద్దకొత్తపల్లి : కరోనా ఉధృతి తీవ్ర స్థాయికి చేరుతుండటంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం నిర్ధారించిన వయసు కలిగిన వారు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఎస్సై నాగన్న కోరారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ ను ఎస్ ఐ వేయించుకున్నారు. ఆయనతో పాటు 150మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ మౌనిక తెలిపారు. అనంతరం మండల పరిధిలోని చంద్ర బండ తండ గ్రామంలో కోవిడ్ కేసులు ఎక్కువ అవడంతో వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు.. శానిటైజర్ ..వ్యక్తిగత పరిశుభ్రత.. సామాజిక దూరాన్ని పాటించి.. విందులు వినోదాలకు దూరంగా ఉండాలన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలాలని డాక్టర్ మౌనిక మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement