Saturday, April 27, 2024

మిడ్జిల్ ఎస్సైపై వేటు..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబుపై వేటు ప‌డింది. మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా,బోయిన్‌ప‌ల్లి గ్రామానికి చెందిన శివ ఇటీవ‌లే మిడ్జిల్ పోలీసు స్టేష‌న్ ఎదుట ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఉన్న‌తాధికారులు ఎస్ ఐ ను అక్క‌డి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు.. ఈ కేసుతో పాటు ఇసుక అక్ర‌మ ర‌వాణా దందాకు స‌హ‌క‌రించార‌ని ఎస్ ఐ పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఎస్పీ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement