Tuesday, May 14, 2024

విద్యార్థులకు ఘన సన్మానం..

మహబూబ్‌నగర్‌ : జి.కె. షోటోకాన్‌ కరాటే క్లబ్‌ ఆధ్వర్యంలో బాలానగర్‌ లో జరిగిన రాష్ట్ర స్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పి వెంకటేశ్వర్లు హాజరై విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమం కింగ్‌ షోటోకాన్‌ కరాటే క్లబ్‌ మాస్టర్‌ ఎండి. జహంగీర్‌ పాషా చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయి కరాటే టోర్నీలో గ్రాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ఘనత సాధించిన విద్యార్థులు మహమ్మద్‌ ఉజేఫ్‌ , మహ్మద్‌ అర్ష్‌ జమీల్‌ (గ్రాండ్‌ చాంపియన్‌షిప్‌, ఓవర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌) లు సాధించగా సీనియర్‌ విభాగంలో మహమ్మద్‌ ఖాజా పాషా (గ్రాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ) సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement