Friday, May 10, 2024

ఆర్టీసీ బస్సులో మంటలు… లోపల 35 మంది ప్రయాణికులు

కృష్ణా జిల్లాలో ఆర్టీసి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు జాతీయ రహదారి పై ఈ ఘటన చోటు చేసుకుంది. అది గమనించిన ప్రయాణికులంతా కూడా కేకలు వేయడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డుపైనే బస్ ను నిలిపివేశారు. ఆ సమయంలో బస్ లో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక బస్ నుంచి అత్యవసర ద్వారములు నుంచి దూకుదామాని ప్రయత్నించగా అవి తాళ్లతో కట్టేసినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. స్థానికులు మంటలను ఆర్పటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు విజయవాడ నుంచి కోదాడ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్ ప్రమాదానికి గురికావడంతో పసిపిల్లలతో ప్రయాణికులంతా రోడ్ పై పడిగాపులు కాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement