Monday, May 20, 2024

Karimnagar – మీరు మాట్లాడితే సెక్యుల‌ర్…మేం మాట్లాడితే మ‌త‌త‌త్వ‌మా .. కెసిఆర్ కు బండి ప్రశ్న


క‌రీంన‌గ‌ర్ – మతం గురించి మీరు మాట్లాడితే సెక్యులర్… మేం మాట్లాడితే మతతత్వమా? అని కెసిఆర్ ను బిజెపి ఎంపి బండి సంజ‌య్ ప్రశ్నించారు. కరీంనగర్‌కు వచ్చి 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా, 20 శాతం ఉన్న ముస్లింలను ఒక్కటి కావాలని పిలుపునివ్వ‌డం ఏమిటంటూ గులాబీ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌రీంన‌గ‌ర్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, హిందువుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన బిఆర్ ఎస్ పార్టీ కి ఈ ఎన్నిక‌ల‌లో కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పాల‌ని పిలుపు ఇచ్చారు..

నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కెసిఆర్ కు గుర్తు చేశారు బండి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన పోలీస్ వలయాన్ని చేధించుకొని హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి జైశ్రీరామ్ అని గర్జించిన వ్యక్తిని తానే అన్నారు. సూటిగా చెబుతున్నానని, హిందువుల కోసం పని చేస్తానని, కరీంనగర్ అభివృద్ధి కోసం పని చేస్తానని, మోదీ బాటలో పయనిస్తానని తెలిపారు.

- Advertisement -

దీంతో.. కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్ ఓ వర్గం ఓట్లను ఏకం కావాలని చెబుతున్నారని… ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆ మతం పుచ్చుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని సవాల్ చేశారు. తాను ఓడిపోతే రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని చెప్పారు. కేసీఆర్‌ హిందూ ధర్మాన్ని హేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అందరూ గుర్తించాలన్నారు. ఇక హిందువులంతా ఒక్కటైతే ఎలాంటి గుణపాఠం ఉంటుందో నిరూపించుదామన్నారు. బండి సంజయ్ హిందువుల గురించి, హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నారని, మీ కోసం కొట్లాడే వ్యక్తిని తాను మాత్రమే అని అన్నారు. కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చి తమాషాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్యాలు చేసిన కెసిఆర్ వెంట‌నే వారికి బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బండి డిమాండ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement