Monday, May 20, 2024

NZB: విద్యుద్ఘాతంతో ఒక‌రు మృతి..

సిరికొండ, మే 10 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం వర్జిన్ తాండ గ్రామంలో శుక్రవారం విద్యుద్ఘాతంతో అదే గ్రామానికి చెందిన బాధవత్ రవి (42) అనే వ్యక్తి మృతి చెందినట్లు సిరికొండ ఎస్సై జి.రమేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన‌ వివరాల ప్రకారం.. మృతుడు రవితన పొలం వద్ద పంప్ మోటర్ కు విద్యుత్ సరఫరా కోసం వైర్లు బిగించడానికి ట్రాన్స ఫార్మ‌ర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసి స్థంభంపైన వైర్లు బిగిస్తున్నారు.

మృతుడు రవి విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయం తెలియని అదే తాండకు చెందిన బనవత్ గణపతి విద్యుత్ సరఫరా కోసం ఏబీ స్విచ్ స్టార్ట్ చేయడంతో విద్యుత్ సరఫరా జరగడం వల్ల విద్యుత్ ప్రమాదంలో రవి మృత్యువాత పడ్డట్లు ఎస్సై వివరించారు. మృతుని భార్య బాధవత్ లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement