Sunday, May 12, 2024

బీటీ రోడ్డు నిర్మాణం ఎప్పుడు

దేవరకద్ర : మండల పరిధిలోని బస్వాయిపల్లి గ్రామంలో మట్టి రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయని అటు ప్రజలు , ఇటు వాహనదారులు ఎదురు చూస్తున్నారు. బీటీ రోడ్డు నిర్మాణం పనులు మంజూరై నెలలు గడుస్తున్నా కూడా ఇంకా పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉన్నదని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుపై సర్వీస్‌ రోడ్డు కొరకై కంకర , మట్టి వేయడం జరిగింది. రోడ్డుపై కంకర రాళ్లు తేలడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు ప్రారంభించడంలో ప్రజా ప్రతినిధులు , కాంట్రాక్టర్‌ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు , అధికారులు శ్రద్ద తీసుకుని వెంటనే బీటీ రోడ్డు పనులు ప్రారంభించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు , వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement