Friday, May 17, 2024

జగన్, చంద్రబాబుల‌ను ఎపి ప్ర‌జ‌లు పాతాళానికి తొక్కేస్తారు – సునీల్ దేవ‌ద‌ర్….

అమ‌రావ‌తి – ముఖ్య‌మంత్రి జగన్, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబులను ప్రజలు పాతాళానికి తొక్కివేసే రోజూ త్వ‌ర‌లోనే రానుంద‌ని, ,ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ బీజేపీ-జనసేన కూటమిని అందలం ఎక్కించే రోజు వ‌చ్చేస్తున్న‌ద‌ని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కుర ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశారు. ఇద్దరూ ఇద్దరేనని, ముఖ్యమంత్రి హోదాలో అధికార బలాన్ని, ప్రజల సొమ్మును స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నంద్యాల ఉప ఎన్నిక జరగ్గా, అందులో టీడీపీ నెగ్గినప్పుడు విపక్షనేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సునీల్ దేవధర్ పంచుకున్నారు. ఆ వీడియోలో జగన్ నాటి సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలిచార‌ని, ఇలా గెలిచినదాన్ని గెలుపు అనుకుంటే అది చంద్రబాబు భ్రమ అని వ్యాఖ్యానించారు. నాటి వ్యాఖ్యలను ఓసారి గుర్తు చేసుకోవాలని సునీల్ దేవధర్ జ‌గ‌న్ కు చుర‌క‌లంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement