Saturday, April 27, 2024

Locked – లక్ష బాకీ! నిర్మల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు తాళం

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మున్సిపల్‌ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్‌ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ప్రైవేటు భవనంలో నడుస్తున్నది. అయితే పన్ను చెల్లించాలని ఎన్నిసార్లు నోటిసులు ఇచ్చినప్పటికీ యజమానులు స్పందించడంలేదని అధికారులు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, బకాయిలు లక్ష రూపాయలు దాటడంతోనే ఆఫీస్‌కు తాళం వేశామని వెల్లడించారు. దీంతో సిబ్బంది, ప్రజలు కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. స్లాట్‌ బుక్‌చేసుకున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement