Wednesday, May 15, 2024

Nirmal – గో సంరక్షక్ హత్యకు నిరసనగా బంద్..

నిర్మ‌ల్ – తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నాందేడ్ జిల్లా కీన్వాట్ తాలూకా శివుని గ్రామంలో గో రక్షక్ సమితి కార్యకర్త శేఖర్ హత్యను నిరసిస్తూ బుధవారం కుబీర్ మండల కేంద్రానికి గో సేవా సమితి, హిందూ వాహిని ఆధ్వర్యంలో బందుకు పిలుపునిచ్చారు.

హత్యకు గురైన శేఖర్ స్వస్థలం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సౌండ్లి గ్రామం కావడంతో కుబీర్ మండలం, తానూర్ మండలం బంద్ పాటించి నిరసన తెలిపారు. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement