Sunday, April 28, 2024

Olympics Day – సూర్యాపేట లో ఘనంగా ఒలింపిక్‌ రన్ – జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట – ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవాన్ని పురస్కరంచుకుని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రం లో నేటి ఉద‌యం నిర్వ‌హించిన జరిగిన ఒలింపిక్‌ రన్‌ గ్రాండ్ సక్సెస్ అయింది. వందలాది మంది పాల్గొన్న ఒలింపిక్ రన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన పరుగు ఎం.జీ రోడ్ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా టాంక్ బండ్ వరకు 2 కి.మీల మేర సాగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూదశాబ్ద కాలం లో క్రీడా రంగం లో స్పష్టమైన మార్పు వచ్చిందని అన్నారు. ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు.స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం అందులో భాగమే అన్నారు. క్రీడా అభివృద్ధి లో దేశానికి దిక్సూచి తెలంగాణ అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల దేహదారుడ్యంతో పాటు స్నేహ సంబంధాలుమెరుగుపడతాయన్నారు. చిన్న తనం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండే వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో క్రీడలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళుతూ దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయన్నారు. మిగతా రంగాల్లో వలే క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలుపాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళుతున్నది అన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర క్రీడారంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదన్న మంత్రీ, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్టేడియాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశాం అన్నారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామాంజిరెడ్డి,స్పోర్ట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, డి.టి.డి.వో శంకర్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారి పెద్ది శ్రీనివాస్ గౌడ్, రామచంద్ర గౌడ్, నామా నరసింహ రావ్, వీటిలో ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement