Sunday, May 5, 2024

KHM: కారు గుర్తుకే ఓటేయండి.. హరిప్రియ నాయక్

ఇల్లందు : కారు గుర్తుకే మరోసారి ఓటు వేయాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరారు. ఇల్లందు మున్సిపాలిటీలోని 20, 21వార్డుల్లో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈరోజు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీకి, పట్టణ ప్రజలకు గత 5ఏళ్లుగా అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హరిప్రియ వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement