Saturday, May 4, 2024

మ‌హిళ‌పై బండ‌రాయితో దాడి.. బంగారం, వెండి దోచుకెళ్లిన దుండ‌గుడు

ఖమ్మం జిల్లా : రాయితో విచక్షణా రహితంగా మహిళపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న వెండి, బంగారు వస్తువులు చోరీ చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో చోటుచేసుకుంది. చింతకాని మండలానికి చెందిన రాంబాయి.. బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఖమ్మం బస్టాండ్‌కు వచ్చింది. ఖమ్మం బస్టాండ్‌లో ఆటో ఎక్కి బైపాస్‌ రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో దింపాలని సదరు మహిళ ఆటో డ్రైవర్‌ను కోరింది.

అయితే, ఫంక్షన్ హాల్ దాటిన ఆటో ఆపకపోవడంతో ఆటో డ్రైవర్ను ఆపమని వేడుకున్న వినిపించుకోకుండా ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు సమీపంలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్. ఆమెపై రాయితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఆటో డ్రైవర్ బంగారు తాడు, వెండి కంకణాలు లాక్కొని పారిపోయాడు. గాయపడిన మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాంబాయిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి సీసీఎస్, ఖమ్మం రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement