Saturday, May 18, 2024

బల్కర్ ఢీకొని ఒకరు మృతి

ముత్తుకూరు మే 5 (ప్రభ న్యూస్) పంటపాలెం -ముత్తుకూరు రోడ్డు మార్గంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. స్థానిక ఎస్సై శివకృష్ణారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నారికేళపల్లి గ్రామానికి చెందిన కిరణ్(29) ప్రభు అనే ఇద్దరు పల్సర్ బైక్ పై వెళ్తుండగా బల్కర్ డి కొనడంతో ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలోనే కిరణ్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంతో మృతుడు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభు అనే వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నట్లు ఎస్సై తెలిపారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement