Thursday, May 2, 2024

KHM: రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగి ఆర్థిక సహాయం..

ఖమ్మం : రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దశలో నేను సైతం ఆర్ధిక ఎదుగులకు చేయూతనిస్తానంటూ ఖమ్మం నగరానికి చెందిన రిటైర్డ్ పోలీస్ గులాం జాఫర్ తన ఫిబ్రవరి ఫించన్ రూ.20 వేలను విరాళంగా ప్రకటించారు. తన స్ఫూర్తితో ఇతరులు కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తన వితరణను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement