Wednesday, May 22, 2024

సత్తుపల్లి కాంగ్రెస్ సీటు ఇవ్వండి.. గాంధీభవన్ లో చంద్రశేఖర్ ద‌ర‌ఖాస్తు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న సత్తుపల్లి అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈమేరకు సోమవారం గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద ఎమ్మెల్యే అభ్య‌ర్థిత్వ దరఖాస్తును, ప్రత్యేక వినతి పత్రాన్ని అందజేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వుడు కాబడి ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సత్తుపల్లి, మధిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కాగా, మధిర నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క( ఎస్సీ మాల) సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినందున సత్తుపల్లి ఎస్సీ స్థానం నుండి మాదిగలకు అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement