Friday, May 3, 2024

కాటికపరుల అన్నదానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మం కాల్వ ఒడ్డు మహాప్రస్థానంకు చెందిన జాంబవంతుడు సొసైటీ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి బాలు ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉన్న వృద్ధ యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి బాలు మాట్లాడుతూ మహిళలు నిరంతర శ్రామికులు Qఅని అన్నారు. సృష్టికి మూలం స్త్రీ, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవిస్తూ వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ కందుకూరి నాగేశ్వరరావు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement