Thursday, May 2, 2024

Breaking : స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి

ఖమ్మం రూరల్ :మండలం పొన్నెకల్ వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో నేలకొండపల్లి మండలం అనాసాగరంకు చెందిన పాలవాయి రమేష్ (50)..ముదిగొండ మండలం వల్లాపురం కు చెందిన చలవాది నాగేశ్వరరావు (55) తీవ్రగాయాలు అయ్యాయి. కాగా ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పొన్నెకల్లు గ్రామంలో రైతు వద్ద మొక్కజొన్న కొనేందుకు గ్రామంలోకి వస్తుండగా ఈ ఘటన జ‌రిగింది .హైద‌రాబాద్ నుండి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసి బ‌స్సు ఓ టిప్ప‌ర్ ని క్రాస్ చేస్తుండ‌గా ఎదురుగా యాక్టీవాని బ‌స్సు ఢీ కొంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement