Saturday, April 27, 2024

మృతుని కుటుంబానికి ఆర్థికసాయం..

జూలపల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బెజ్జికి రాజలింగం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌ నిరుపేద కుటుంబానికి రూ. 3వేల ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు సాయాన్ని తెరాస నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బాపూర్‌ ఎంపీటీసీ దండే వెంకటేశం, నల్లాల కనకరాజు, ఉపసర్పంచ్‌ కొప్పుల మహేష్‌, అధ్యక్షులు ఎదుల్లా కనుకయ్య, మనుమండ్ల మల్లేష్‌, నాయకులు నెరువట్ల కిష్టయ్య, మానుమండ్ల శ్రీనివాస్‌, ఎదుల్లా మల్లేష్‌, మోదుంపల్లి కొండయ్య, మానుమండ్ల నర్సయ్య, నెరువట్ల రాజయ్య, బెజ్జికి సతీష్‌, బెజ్జికి సంతోష్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement