Friday, March 29, 2024

మక్కాన్‌సింగ్‌ కోలుకోవాలని పూజలు..

గోదావరిఖని: కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాగూర్‌ కుటుంబం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జనగామ శ్రీ త్రిలింగా రాజరాజేశ్వరా స్వామి దేవాలయంలో 108 కొబ్బరికాయలతో స్వామి వారికి అభిషేకం, మొక్కులు చెల్లించారు. స్థానిక 9వ డివిజన్‌లోని జనగామ శ్రీ లింగేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు తజోద్దీన్‌ బాబా, కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి జనగామ శివ, కార్పొరేషన్‌ ఉపాధ్యక్షులు చెలుకల శ్రీనివాస్‌ యాదవ్‌, పులి వెంకటేశ్వర్లు, ఆత్రం రాజేశ్వర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement