Saturday, May 25, 2024

ఘనంగా ధ్వజ స్తంభం పున: ప్రతిష్ఠాపన మహోత్సవం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజ స్థంభం పున: ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం వేద పండితుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించిన ప్రతిష్ట మహోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యమ్మ-కొమురయ్య,ఎంపీటీసీ పద్మావతి-ఇంద్రారెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్,ఉప సర్పంచ్ నిరంజన్ రెడ్డి,హనుమంత రావు,గ్రామ శాఖ అధ్యక్షుడు గొర్ల కుమార్,శివ, గుండేటి ఐలయ్య, లింగమూర్తి, కోమాల్ రెడ్డి, వన్నా రెడ్డి,సత్యనారాయణ రెడ్డి, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement