Saturday, April 27, 2024

ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్లనే నష్టం.. బండి సంజయ్

ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్లనే తమకు నష్టపరిహారం అందించకపోవడంతో తాము నష్టపోయామని రైతులు తెలిపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ముందుగా కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేటలో వానకు దెబ్బతిన్న పంటలు పరిశీలించి.. రైతులకు ధైర్యం చెప్పారు బండి సంజయ్. రైతులంతా అధైర్య పడొద్దని.. బీజేపీ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని బండి సంజయ్ కు వివరిస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే తమకు పంట నష్ట పరిహారం అందకుండా పోయిందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారని బండి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement