Sunday, April 28, 2024

చోరీ సొత్తు అప్ప‌గింత‌… సిపి చిత్రపటానికి పాలాభిషేకం

రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి చిత్రపటానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం సిపి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం గ్రామానికి చెందిన రావుల మల్లమ్మ మాట్లాడుతూ… 30 ఏళ్లుగా తన భర్త సింగరేణిలో ఉద్యోగం చేసి ఇటీవలే పదవీ విరమణ పొందారన్నారు. కష్టించి సంపాదించిన సొత్తు ఈనెల 7వ తేదీన చోరీకి గురైందన్నారు. తమ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, చోరీ విషయం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామన్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పెద్ద మనసుతో ఎట్టి పరిస్థితుల్లో చోరీ కేసు చేధించాలని ఆదేశించడంతో సుల్తానాబాద్ పోలీసులు దొంగను పట్టుకున్నారన్నారు. చోరీకి గురైన 11 లక్షల రూపాయల నగదు, బంగారం ఇతర వస్తువులను దొంగ నుండి స్వాధీనం చేసుకొని తమకు అప్పగించడం వల్ల తమ కుటుంబం రోడ్డు పాలు కాకుండా చేశారన్నారు. పోలీస్ శాఖకు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement