Friday, May 10, 2024

నిధుల మంజూరు పట్ల హర్షం..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాగట్లపల్లె నుండి వయా దుమాల, అక్కపల్లి, శివంగాలపల్లి వరకు దుమాల గ్రామ ప్రజలు, రైతులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న బిటి రోడ్డు మంజూరు చేయడం పట్ల ఇందుకు సహకరించిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కి, మంత్రి కేటి రామారావుకి.. దుమాల గ్రామసర్పంచ్‌ కదిరె రజిత శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా 3 కోట్ల 68 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement