Tuesday, April 30, 2024

గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సైకి క‌రోనా వ్యాక్సిన్..

పుదుచ్చేరి/ హైద‌రాబాద్ : ‌తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ నేడు కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది ఆమెకు టీకా ఇచ్చారు. పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్ర‌భుత్వ మ‌హిళా, శిశువుల ఆస్ప‌త్రికి వెళ్లిన త‌మిళిసై అక్క‌డ వైద్యుల‌తో టీకా వేయించుకున్నారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌తి ఒక్క‌రూ టీకా తీసుకోవాల‌ని పిలుపు ఇచ్చారు. టీకాపై ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement