Friday, May 10, 2024

సీఎంఆర్ఎఫ్ తో చేయూత: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చేయూతను అందిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామానికి చెందిన శంకరమ్మకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 3 లక్షల రూపాయల ఎల్వోసీ చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ తో ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి ఎల్వోసీ ద్వారా ఆదుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల సదయ్య,ఉప సర్పంచ్ నాగేశ్వర్ రావు, ధర్మపురి, బయ్య కొముర కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement