Wednesday, May 15, 2024

బండి…చిల్ల‌ర రాజ‌కీయాలు మానుకో: కెటిఆర్

రాజ‌న్న సిరిసిల్ల : చిల్ల‌ర రాజ‌కీయాలు మాని ఒక్క నీటి ప్రాజెక్ట్ కైనా జాతీయ హోదా తీసుకురండి అంటూ మంత్రి కెటిఆర్ బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కి స‌వాల్ విసిరారు… మంతి కెటిఆర్ ఇల్లంత‌కుంట మండ‌లంలో ప‌ర్య‌టించారు.. ఈ సంద‌ర్భంగా ఇల్లంత‌కుంట మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రం, వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, బస్టాండ్‌ వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్‌ నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల అంగడిని మంత్రి ప్రారంభించారు., ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ నిప్పులు చెరిగారు. బండి సంజ‌య్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్ల‌లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు ప్ర‌త్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చ‌గొట్ట‌డం, చిల్ల‌ర రాజ‌కీయం చేయ‌డం స‌రికాదు. ద‌మ్ముంటే అభివృద్ధిలో త‌మ‌తో పోటీ ప‌డాల‌న్నారు. చేత‌నైతే కేంద్రం నుంచి రాష్ర్టాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలి. ద‌మ్ముంటే కాళేశ్వ‌రం లేదా పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జాతీయ హోదా తీసుకురా? అని స‌వాల్ చేశారు. చేతనైతే మ‌రిన్ని జాతీయ ర‌హ‌దారులు, న‌వోద‌య పాఠ‌శాల‌లు తీసుకురా? అంతేకానీ తెల్లారితే చిల్ల‌ర మాట‌లు, చిల్లర కూత‌లు కూస్తే ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోరు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడితే కొత్త బిచ్చ‌గాడు అని వ‌దిలిపెడుతున్నారు. ఇప్ప‌టికైనా బుద్ది తెచ్చుకుని మాట్లాడాలి. దుబ్బాక‌లో గెలిచినోళ్లు.. ఇటీవ‌ల జ‌రిగిన రెండు ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు గెలుపొంద‌లేక‌పోయారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం సృష్టించ‌బోతోంది. అక్క‌డ‌ బీజేపీ డిపాజిట్ గ‌ల్లంతు కావ‌డం ఖాయం’ అని అ‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement