Thursday, May 2, 2024

ఆర్టీసీ బస్సు బోల్తా..30 మందికి గాయాలు

కర్నూలు – జిల్లాలోని చాగలమర్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలి పల్టీలు కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పెద్ద బోధనం గ్రామంలో చోటు చేసుకుంది. కడప నుంచి కర్నూలు వస్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement