Tuesday, May 14, 2024

మంత్రి ఈశ్వర్ తో మాజీ మంత్రి కనుమూరి భేటీ.. భారాస ఆవిర్భావం పై చర్చ

తిరుపతి పర్యటనలో తెలంగాణ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు లు ఒకరికొకరు తారసపడ్డారు. వీరిద్దరి మధ్యలో తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయి. ఒకరినొకరు పలకరింపులు జరిగాక కనుమూరి తెలంగాణ రాజకీయలు వాటి ప్రభావంతో పాటు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీపై ప్రధానంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న కోణంలో జాతీయ పార్టీ వైపు వేసిన అడుగుల గురించి వాకబు చేస్తూనే పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండ బోతున్నాయన్నది తాజా,మాజీ మంత్రుల మధ్యన జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది.
కలియుగ దైవం వేంకటేశ్వరుని సన్నిధిలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కీలక నేతల కలయిక తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిలో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణితో పాటు కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడం హైలెట్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement