Tuesday, July 23, 2024

Ananya: బాలీవుడ్ లో అన‌న్య ఎంట్రీ….

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన టాలెంట్ తో హీరోయిన్ గా రాణిస్తుంది.. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు హీరోయిన్ గా స్కోప్ ఉన్న సినిమాలు తన ఖాతాలో పడలేదు.. కానీ రీసెంట్ గా వచ్చిన తంత్ర సినిమా మాత్రం మంచి హిట్ ను అందించింది.. ఈ జోష్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారుగా… అవును మీరు విన్నది నిజం.. కానీ హీరోయిన్ గా కాదు రైటర్ గా ఎంట్రీ ఇచ్చేసిందట.. ‘మల్లేశం’ సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ తీసిన హిందీ సినిమా ‘8 ఏఎం మెట్రో’ సినిమా కథకు తన సహకారం అందించింద‌ట‌..

- Advertisement -

ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.. ఆ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా మొదట్లో.. అనన్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్లైడ్ ఉంది.

మొత్తానికి అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది..ఇక ‘పొట్టేల్’ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement