Friday, April 26, 2024

వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య : పెద్దపల్లి డీసీపీ రూపేష్

ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా ధృవ పాఠశాలలు ప్రారంభించినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్ పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం లోని ఇటుక బట్టిల లో ధృవ పాఠశాలలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వలస కార్మికులు పొట్ట కోటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పని చేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని ధృవ పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐ ఇంద్ర సేనా రెడ్డి, ఎస్ఐ ఉపేందర్ తో పాటు బట్టి యజమానులు, వలస కార్మికుల తోపాటు వారి పిల్లలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement