Friday, April 26, 2024

ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుకు కరోన

కరోన మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు కరోన బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఎమ్మెల్సీ పరీక్షలు చేసుకోగా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తనను గత కొన్ని రోజులుగా కలిసిన వారందరూ పరీక్షలు చేసుకోవాలని, వారం రోజుల పాటు ఎవరికీ అందుబాటులో ఉండాలని సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్సీ తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement