Tuesday, May 21, 2024

TS | మిర్చీలు వేసి, ఓట్లు అడిగి.. చెన్నూరు లో బాల్క సుమన్ ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇవ్వాల (శనివారం) మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా హోటల్లో మిర్చీలు వేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని., చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement