Wednesday, May 8, 2024

వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు.. ఎమ్మెల్యే దాసరి

తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఈనెల 30న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించే జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. శ్రీవారి కల్యాణం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవమూర్తులకు టీటీడీ అర్చకులు కల్యాణోత్సవం నిర్వహిస్తారన్నారు.

నియోజకవర్గ ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం చూపించాలనే ఉద్దేశంతో పెద్దపల్లిలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 30 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు జూనియర్ కళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం జరుగుతుందని, నియోజకవర్గ ప్రజలు కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామి వారి కృప కు పాత్రులు కాగలరని కోరారు. ఎమ్మెల్యే వెంట పెద్దపల్లి ఏసీపీ మహేష్, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement