Saturday, April 27, 2024

ముఖ్యమంత్రి సభకు చురుగ్గా ఏర్పాట్లు : ఎంపీ వెంకటేష్ నేత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ పేర్కొన్నారు. ఈరోజు బహిరంగ సభ జరిగే సభాస్థలిని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… ఈనెల 29న‌ జరిగే బహిరంగ సభకు లక్ష మంది హాజరవుతారన్నారు. పెద్దపెల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుండి సీఎం సభ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement