Thursday, March 28, 2024

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుకు నిప్పు

అర్ధ‌రాత్రి ఆర్టీసీ బ‌స్సుకు నిప్పంటుకున్న ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే అగ్నిమాప‌క సిబ్బంది మంటలను అదుపుచేశారు. ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సుకు దుండ‌గులు నిప్పంటించిన‌ ఘ‌ట‌న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందే ఉన్న బస్ డిపోలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివరాల్లోకి వెళితే …సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు ఆర్టీసీ బస్ డిపోలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సు కు నిప్పంటించారు. ఏపీ 11జెడ్ 6893 బస్సుకు నిప్పంటించడంతో బస్సులో పూర్తిగా సీట్లు దగ్ధ‌మ‌య్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపుచేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించేది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్ డిపోలోకి చొరబడిన బస్సుకు నిప్పంటించిన వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటామని పోలీసులు మీడియా ద్వారా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement