Monday, April 29, 2024

ఈటల రాజేందర్ కి పితృ వియోగం-నేడు అంత్య‌క్రియ‌లు

ఈట‌ల రాజేంద‌ర్ కి పితృవియోగం క‌లిగింది.ఆయ‌న తండ్రి తీవ్ర అస్వస్థతకు గురై…మరణించారు. 104 ఏళ్లు ఉన్న ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య.. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. గత వారం హన్మకొండలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రిని తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఈటల మల్లయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని స్వగృహంలో నేటి మధ్యాహ్నం ఈటల మల్లయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement