Wednesday, May 15, 2024

బిహార్‌, జార్ఖండ్‌లో ఈడీ దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జార్ఖండ్‌ అక్రమ మైనింగ్ స్కామ్‌లో పలు ప్రాంతాల్లో మరోసారి దాడులు నిర్వహించింది. రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ అనే వ్యక్తికి చెందిన బిహార్‌, జార్ఖండ్‌లోని పలు కార్యాలయాలు, ఇండ్లపై ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రేమ్‌ ప్రకాశ్‌కు రాజకీయ నాయకులతో గట్టి సంబంధాలున్నాయి. ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఈడీ జూలై 8న సాహెబ్‌గంజ్‌, బర్హయిత్‌, రాజ్‌మహల్‌, మీర్జాపోస్ట్‌లలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితుడైన పంకజ్‌ మిశ్రాతో పాటు అతని సహచరులకు సంబంధించిన 19చోట్ల ఈడీ సోదాలు నిర్వహించిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా ఈరోజు తెల్లవారు జాము నుంచి బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని దాదాపు 17చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement