Tuesday, May 21, 2024

తల్లి, బిడ్డల పట్ల ప్రత్యేక దృష్టి

ముత్తారం: గ్రామాల్లో గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని గర్భిణుల నమోదు, ఆరోగ్యంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సూచనలు చేయాలని, రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు రక్తహీనత లేకుండా మాత్రలు అందించాలన్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చూడడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న సేవలపై వివరించాలన్నారు. ఈకార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement