Friday, April 26, 2024

రాజన్నను దర్శించుకోవడం సంతోషకరం…రేవంత్ రెడ్డి

భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, దేవాలయ మాజీ చైర్మన్ అది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement