Tuesday, April 23, 2024

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.. వైజాగ్ లో పైన‌ల్ షెడ్యూల్

మాస్ హీరో ర‌వితేజ న‌టిస్తోన్న చిత్రాల్లో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఒక‌టి.ఈ చిత్రం ఫైన‌ల్ షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభ‌మ‌యింది.ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. 70,80 ద‌శ‌కాల్లో నాగేశ్వర‌రావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగ‌త‌నాలు, దోపిడీలు చేస్తూ పోలీసుల‌కు చిక్కకుండా త‌ప్పించుకునే వాడు. ఇలాంటి గ‌జ‌దొంగ క‌థ బ‌యోపిక్‌గా తెర‌కెక్కతుండటంతో ప్రేక్షకుల‌లో తీవ్ర ఆసక్తి నెల‌కొంది.పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కనున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement