Saturday, April 27, 2024

MDK: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాహనాల తనిఖీ

మనోహరబాద్, ప్రభ న్యూస్ : మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలో మేజర్ పంచాయతీ కాళ్లకల్ 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వాహన, కాన్వాయ్ లను కాళ్లకల్ లో పోలీసులు ఏర్పాటు చేసి చెకపోస్ట్ వద్ద తనిఖీ చేపట్టారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో మెదక్ జిల్లా బార్డర్ 44వ జాతీయ రహదారి కాళ్లకల్ గ్రామ చివరలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ లో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ లను పోలీసులు తనిఖీ చేపట్టారని ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. పోలేసులు నిర్వహించిన వాహన తనిఖీకి కిషన్ రెడ్డి పూర్తిగా సహకరించారని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారుల సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement