Sunday, May 5, 2024

KHM: ఏజెన్సీలో మెచ్చా ప్రచార హోరు

అశ్వారావుపేట, నవంబర్ 3 (ప్రభ న్యూస్) : అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఏజెన్సీలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మద్దిరావమ్మ సెంటర్లో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అక్కడ స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఎమ్మెల్యే జాతర సందర్భంగా ఆడి పాడి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ నుండి రామన్నగూడెం, అనంతరం, గాండ్లగూడెం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రచారంలో ఆకర్షితులైన ప్రజలు తమకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మరలా మీరే ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement