Sunday, May 12, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో దొంగ ఓటు వేసిన తాండూరు ఛైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న‌..

హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్ స్వ‌ప్న‌ దొంగ ఓటు వేసినట్లు నిర్ధార‌ణైంది. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా ఆమె పోలింగ్ రోజున‌ వేశారు. దీనిపై ఫిర్యాదులు రావ‌డంతో ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో క‌లెక్ట‌ర్ విచారణ చేపట్టిన ఆమె దొంగ ఓటు వేసినట్లు తేల్చారు. దీంతో స్వప్న రాజీనామా చేయాలని బల్దియా ఆఫీసు ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. కాగా ఈ ఆరోప‌ణ‌లు న్యాయ‌స్థానంలో రుజువైతే గ‌రిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement