Wednesday, May 1, 2024

వైసీపీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఈరోజు కలిశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టించిందనే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కేసుల నుంచి తనను రక్షించాలని కోరారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు. తనను సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా చేస్తున్నారంటూ కొంత కాలంగా రఘురామకృష్ణరాజు సొంత పార్టీపైనే మండిపడుతున్న సంగతి తెలిసిందే. స్థానిక నేతల చేత తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అడుగు పెడితే తనను అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారని చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement